పోస్ట్‌మ్యాన్‌ నిర్వాకం.. రెండేళ్లుగా

20 Dec, 2020 11:12 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ: సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. అయితే, బట్వాడా చేయకుండా రెండేళ్లుగా 7 వేల ఉత్తరాలను మూలన పడేశాడో పోస్ట్‌మ్యాన్‌. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్‌ సమీపంలోని తన బంధువులకు చెందిన ఓ హోటల్‌ గదిలో 12 సంచుల్లో పోస్ట్‌మ్యాన్‌ బాలకృష్ణ ఉత్తరాలను పడేశాడు. తమకందిన సమాచారంతో ఈ బాగోతం బయటపడిందని, శనివారం ఆ ఉత్తరాలను స్వాధీ నం చేసుకున్నామని, ఇందుకు బాధ్యుడైన బాలకృష్ణను సస్పెండ్‌ చేసినట్లు ఏఎస్పీ రాజనర్సాగౌడ్‌ తెలిపారు. చదవండి: పెన్షన్‌తో పాటు కరోనాను పంచాడు..

మరిన్ని వార్తలు