‘బీరు’ బాబులకు శుభవార్త.. ధర తగ్గింది!

6 Jul, 2021 07:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బీర్‌’బలులకు శుభవార్త.. ప్రతి బీర్‌ బాటిల్‌పై రూ.10 స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల బీర్లపై ధర రూ.10 తగ్గనుంది, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని  పేర్కొన్నారు.

సోమేశ్‌ కుమార్‌తో సినీ ప్రముఖుల భేటీ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో టాలీవుడ్‌ నిర్మాతలు సోమవారం బీఆర్కేఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.   

మరిన్ని వార్తలు