హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు

14 Jan, 2023 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుపొద్దున్నే ముగ్గులతో ఆడపడుచులు, భోగి మంటలతో ఆడిపాడుతున్నారు అంతా. ఇక కేబీఆర్‌ పార్క్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. 

ఈ వేడుకల్లో భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు.

మరిన్ని వార్తలు