ప్రొటెం చెర్మన్‌గా వి భూపాల్‌రెడ్డి నియామకం

3 Jun, 2021 18:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి ప్రొటెం చెర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అయిన భూపాల్‌ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై ఉత్తర్వులు జారీ చేశారు. జూన్‌ 4 నుంచి భూపాల్‌ రెడ్డి ప్రొటెం చెర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికై  చైర్మన్‌ పదవిని దక్కించుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం గురువారంతో ముగిసింది. 

చదవండి: భూముల డిజిట‌ల్ స‌ర్వేపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు