బోయినపల్లి కేసు: 14 మందికి బెయిల్‌ మంజూరు

18 Feb, 2021 14:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులోని నిందితులకు సికింద్రాబాద్‌ కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. 14 మందికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రతివారం పీఎస్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. కాగా ఇప్పటికే అఖిలప్రియకు జనవరిలో కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భార్గవ్‌రామ్‌ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది.
చదవండి: భార్గవ్‌రామ్‌కు కోర్టులో చుక్కెదురు..
 

మరిన్ని వార్తలు