డెంగీతో బాలుడి మృతి 

22 Aug, 2021 02:44 IST|Sakshi
జర్పుల మోహన్‌ (ఫైల్‌)

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెంలో డెంగీ సోకడంతో శనివారం ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన జర్పుల వీరన్న, కవిత దంపతుల కుమారుడు మోహన్‌ (14)కు 20 రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానికంగా ఓ ఆర్‌ఎంపీకి చూపించారు. అయినప్పటికి జ్వరం తగ్గకపోవడంతో 18న ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. అయితే హైదరాబాద్‌కు తరలించేలోపే మోహన్‌ చనిపోయాడు. బాలుడు మహబూబాబాద్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.

మరిన్ని వార్తలు