ఆటోను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మహిళలు దుర్మరణం

23 Oct, 2022 12:29 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్‌ మండలం కృష్ణారావుపేటలో వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ధర్మపురి మండలం కమలాపూర్‌ వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి: పాణం తీసిన బంగారు గొలుసు 

>
మరిన్ని వార్తలు