8 నుంచి ‘ఓటుకు కోట్లు’ తుది విచారణ 

2 Mar, 2021 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసు తుది విచారణ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ 2015లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఆధారాలను ఏసీబీ సోమవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఇందులో రికార్డయిన వీడియోతోపాటు నిందితులకు సంబంధించిన ఫోన్‌ రికార్డింగ్స్‌ తో కూడిన 1 టీబీ హార్డ్‌డిస్క్‌లు రెండు, ఒక డీవీడీఆర్‌ ఉన్నాయి. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్‌సన్‌ను ఈనెల 8న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని 

మరిన్ని వార్తలు