జీఎస్‌టీ అధికారి జనార్థనరావుపై సీబీఐ కేసు నమోదు

2 Oct, 2020 20:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీఎస్‌టీ అధికారి కేఎస్‌ఎస్‌ జనార్థన్‌రావుపై సీబీఐ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి దాదాపు 1.27 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. జీఎస్‌టీ హైదరాబాద్‌ కమిషనరేట్‌లో సూపరింటెండెంట్‌గా జనార్థన్‌రావు పనిచేస్తున్నారు. జనార్థన్‌రావు ఇళ్లు, కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. చదవండి : సిబిఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారు?

మరిన్ని వార్తలు