రామోజీ ఫిల్మ్‌సిటీని ముట్టడిస్తాం: సీపీఎం

23 Nov, 2022 13:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం ఆధ్వర్యంలో ఛలో రామోజీ ఫిల్మ్‌సిటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. 2007లో అప్పటి ప్రభుత్వం 670 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

అయితే ఈ స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు. అర్హులకు స్థలాలు చూపెట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. లేనిపక్షంలో రామోజీ ఫిల్మ్‌ సిటీని ముట్టడిస్తామని సీపీఎం నాయకులు పేర్కొన్నారు.

చదవండి: (సింహం వర్సెస్ సివంగి: యుద్ధం వెనుక కారణాలేంటి?)

మరిన్ని వార్తలు