HYD: ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

14 Jun, 2022 18:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఈడీ విచారించడంపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం నిరసనల్లో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పెట్రోల్‌ బాటిల్స్‌తో వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు.. జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఈడీ ఆఫీసు ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మరిన్ని వార్తలు