OMC Case: ఒబులాపురం మైనింగ్‌ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌

8 Nov, 2022 12:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్‌) కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్‌. ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌ ఇస్తూ మంగళవారం హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది.

కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు