యువతలో ఆవేదన అగ్నిగా మారింది

18 Jun, 2022 01:59 IST|Sakshi

ఖమ్మం సహకారనగర్‌: రక్షణ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ తీసుకున్న యువతకు నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతుండటంతో.. వారి గుండెల్లోంచి పెల్లుబికిన ఆవేదనే సికింద్రాబాద్‌ ఘటనకు కారణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

సోనియాగాంధీ, రాహుల్‌ను ఈడీ అధికారులు విచారణ పేరిట వేధిస్తున్నారని ఖమ్మం జిల్లా కేం ద్రంలో శుక్రవారం కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశంలోని యువతీ, యువకులు ఉద్యోగాలు రాక నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నా రని ఆవేదన వ్యక్తంచేశారు.  

మరిన్ని వార్తలు