మహబూబాబాద్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌.. కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం

12 Jan, 2023 13:03 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మహబూబాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ భవనాన్ని, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

 కాగా, జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా తర్వాత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, సీఎం కేసీఆర్‌.. భదాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. 

మరిన్ని వార్తలు