Siddipet: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

20 Jun, 2021 12:33 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం సిద్దిపేటలో చేరుకున్నారు. అనంతరం సిద్దిపేటలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.
చదవండి: లాక్‌డౌన్‌తోనే కేసులు తగ్గాయ్‌: సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు