పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్

5 Sep, 2020 22:40 IST|Sakshi

సాక్షి, వరంగల్ రూరల్‌‌ : పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులపై ఆరా తీశారు. ఎమ్మార్వో ఆఫీసు, పంచాయతీ ఆఫీసుల్లో ఉండే రికార్డులను అడిగి తెలుసుకున్నారు. ఏనుగల్ గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్య‌వ‌సాయ భూమిని వ్య‌వ‌సాయేత‌ర భూమిగా మార్పు త‌దిత‌ర అంశాల గురించిఅడిగి తెలుసుకున్న‌ట్లు రమాదేవి మీడియాకు తెలిపారు. 

మరిన్ని వార్తలు