సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్కు యాదాద్రి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం.. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ప్రధానాలయంలో శిల్పి పనుల తుది మెరుగులు, శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులతో పాటు కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు.