సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు సమీక్ష నిర్వహించారు. వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్లో రెండు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలన్నారు కేసీఆర్. స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి...ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.