యాదాద్రి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ బదిలీ

13 Jun, 2021 21:01 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, యాదాద్రి:  కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ బదిలీ అయ్యారు. పల్లె, పట్టణ ప్రగతిలో అలసత్వం చేసినందుకు ఆమెను వేరే చోటికి బదిలీ చేసినట్లు తెలిసింది. కాగా అనితా రామచంద్రన్‌ స్థానంలో యాదాద్రి కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. కాగా అంతకముందు ప‌ల్లె ప్రగతి, ప‌ట్టణ పురోగతిపై ప్రగతిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం స‌మీక్షా స‌మావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అంద‌రి భాగ‌స్వామ్యం అవ‌స‌రం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.


కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి 

మరిన్ని వార్తలు