మత్స్యకారులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి

12 Feb, 2023 03:20 IST|Sakshi
అసెంబ్లీ వద్ద మెట్టు సాయికుమార్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు 

అసెంబ్లీ వద్ద టీపీసీసీ ఫిషర్‌మెన్‌ సెల్‌ ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: తమకు రూ.10 లక్షల కవరేజీతో హెల్త్‌కార్డులు ఇవ్వాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తతకు దారి తీసింది. మత్స్యకారులను ఆదుకోవాలంటూ టీపీసీసీ ఫిషర్‌మెన్‌ సెల్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారని చెపుతున్నారు.

అనూహ్యంగా ఆటోలో అసెంబ్లీ ముందుకు వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, మత్స్యకారులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్‌ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, రూ.10 లక్షల కవరేజీతో హెల్త్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు