పరిమళించిన మానవత్వం..యాచకుడికి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సపర్యలు 

30 Oct, 2021 10:41 IST|Sakshi

సాక్షి, షాద్‌నగర్‌: ఆకలితో అలమటిస్తున్న ఓ యాచకుడు రోడ్డు దాటుతూ కిందపడిపోయాడు. వెంటనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సాయం అందించి మానవత్వాన్ని చాటాడు. షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మురళీ శుక్రవారం పట్టణంలోని ముఖ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో డొక్కలు ఎండిపోయి ఆకలితో అలుమటిస్తూ ఓ యాచకుడు రోడ్డు దాటేందుకు యత్నిస్తూ కింద పడిపోయాడు.
చదవండి: టీఎస్‌ఆర్టీసీ: ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే రూ.300 కోట్ల రుణం

గమనించిన కానిస్టేబుల్‌ మురళీ ఆ యాచకుడిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. ఆకలితో ఉన్నానని, కళ్లు తిరుగుతున్నాయని ఆ యాచకుడు సైగలు చేయడంతో వెంటనే కానిస్టేబుల్‌ యాచకుడికి నీళ్లు తాగించి, పక్కనే ఉన్న పండ్లు కొనిచ్చి ఆకలి తీర్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌ కానిస్టేబుల్‌ మురళీకి రివార్డు అందజేశారు. తోటి పోలీస్‌ సిబ్బంది అతన్ని అభినందించారు. 
చదవండి: కూకట్‌పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి..

మరిన్ని వార్తలు