హైకోర్టులో రాజ్యాంగ పరిరక్షణ దినం

27 Nov, 2021 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టులో ‘రాజ్యాంగ పరిరక్షణ దినం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈకార్యక్రమానికి న్యాయ మూర్తి జస్టిస్‌ నవీన్‌ రావు, హైకోర్టు న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు, తదితరులు ప్రసంగించారు.

మరిన్ని వార్తలు