పాఠశాలలో కరోనా కలకలం

26 Sep, 2021 03:06 IST|Sakshi

నలుగురు విద్యార్థులు, ఓ చిన్నారికి పాజిటివ్‌

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దంతెలతండా ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులకు, పాఠశాల ఆవరణలోనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ఓ చిన్నారికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

శుక్రవారం పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి, మండలంలోని ఇప్పలతండాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్‌ కోవిడ్‌ బారిన పడడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వారి ఆదేశాల మేరకు పాఠశాలలో శనివారం 29 మంది విద్యార్థులకు, పాఠశాల ఆవరణలోనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కేసులు వెలుగుచూశాయి. డీఈవో సోమశేఖరశర్మ, ఎంఈఓ ఠాకూర్‌ రాంసింగ్‌ పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు రోజుల పాటు స్కూల్‌కు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు