Corona Alert: తెలంగాణలో పెరిగిన పాజిటివ్‌ కేసులు

14 Jun, 2022 20:30 IST|Sakshi

తెలంగాణలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 219 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

ఇక దేశంలో కూడా కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుతుండటం టెన్షన్‌కు గురిచేస్తోంది. తెలంగాణ పక్కా రాష్ట్రం మహారాష్ట్రలో 24 గంటల్లో 2956 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 18267కు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1000 దాటింది. తాజాగా 1118 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. యాక్టివ్‌ కేసుల సంఖ‍్య.. 3177కు చేరుకుంది.  

మరిన్ని వార్తలు