తెలంగాణలో కొత్తగా 2,707 మందికి కరోనా పాజిటివ్‌

13 Jan, 2022 21:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,707 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత 24 గంటలలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: కరోనా ఉధృతి..  రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

మరిన్ని వార్తలు