తెలంగాణలో కొత్తగా 1607 పాజిటివ్‌

7 Nov, 2020 10:21 IST|Sakshi

మరో ఆరుగురు మృతి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1607 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24 గంటల్లో 937 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్‌ బాధితుల్లో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1372 కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల మొత్తం సంఖ్య 2,48,891 కు చేరింది. వైరస్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,27,583. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 19,936. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు