తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు, 10 మరణాలు

30 Aug, 2020 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,924 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  1,23,090కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 818కి చేరింది. తాజాగా 1,638 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్‌ అయ్యారు.
(చదవండి : 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌?)

ఇప్పటి వరకు మొత్తంగా 90, 988 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 31,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.43 శాతంగా ఉండగా.. తెలంగాణలో 73.9 శాతంగా ఉంది.  కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 461 నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 181, కరీంనగర్‌ 172 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు