తెలంగాణలో కొత్తగా 565 కరోనా కేసులు

2 Dec, 2020 10:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,70,883కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 925 కాగా, వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినవారి మొత్తం సంఖ్య 2,60,155గా నమోదైంది. చదవండి: దేశానికంతా టీకా అక్కర్లేదు

మంగళవారం నాడు కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందినవారి మొత్తం సంఖ్య 1462కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,266గా ఉంది. గృహ, సంస్థల ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల సంఖ్య 7,219గా ఉంది. కరోనాతో మృతి చెందిన వారి మరణాల శాతం 44.96 గా ఉండగా, ఇతర వ్యాధులతో మృతి చెందిన వారి మరణాల రేటు 55.04గా నమోదైంది.    

మరిన్ని వార్తలు