తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు

8 Aug, 2020 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1091 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 54,330గా ఉంది. కరోనాతో మరో 14 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 615కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 464, వరంగల్‌ అర్బన్ జిల్లా‌ 187, మేడ్చల్ జిల్లా‌ 138, కరీంనగర్‌ జిల్లా 101 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు