Rapido: కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ

5 Dec, 2021 12:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే ప్రకటనా చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని కోర్టు ఆదేశించింది. యూట్యూబ్‌ తన ప్లాట్‌ఫామ్‌ నుంచి పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించంది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్‌ చేయబడతారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ర్యాపిడో టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.

చదవండి: (సజ్జనార్‌ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..)

మరిన్ని వార్తలు