సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రేపు (శనివారం) కరోనా వ్యాక్సిన్ డ్రై రన్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. తిలక్నగర్ పీహెచ్సీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి, సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వ్యాక్సిన్ డ్రై రన్కు రంగం సిద్ధం చేశారు. ఒక్కో సెంటర్లో 25 మంది హెల్త్ వర్కర్లకు వాక్సినేషన్ చేయనున్నారు. (చదవండి: కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్కు గ్రీన్ సిగ్నల్)