వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దు: సీపీ సజ్జనార్

15 May, 2021 15:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన వచ్చిందని సీపీ సజ్జనార్‌ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తప్పకుండా వేయించుకోవాలి. ఈ-పాస్‌ ఉంటేనే ఇతర రాష్ట్రాలకు అనుమతి ఇస్తాం.  కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు