సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో అమలు చేయనున్న దళిత సాధికారత పథకానికి.. 'తెలంగాణ దళిత బంధు' పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నియోజకవర్గంలో అమలుకానుంది. 'తెలంగాణ దళిత బంధు' పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నియోజకవర్గం ఎంపికైంది.