మరో రెండేళ్లు ‘వీ హబ్‌‘ సీఈవోగా దీప్తి రెడ్డి 

6 Aug, 2020 08:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘వీ హబ్‌’ సీఈవోగా దీప్తిరెడ్డి రావుల సర్వీసును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జనవరి ఒకటిన వీ హబ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన దీప్తి ఈ ఏడాది మార్చి 31వరకు సేవలు అందించారు. మరో మూడేళ్ల పాటు ఒప్పంద కాలాన్ని పొడిగించాల్సిందిగా దీప్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో దీప్తి రెడ్డిని రూ.2 లక్షల నెలసరి వేతనంపై మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (తెలంగాణకే నా సర్వీస్‌!)

>
మరిన్ని వార్తలు