డిసెంబర్‌ 11న సీబీఐ విచారణకు సిద్ధమన్న కవిత

6 Dec, 2022 20:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ  లిక్కర్ స్కాం కేసులో తన వివరణ ఇవ్వడానికి డిసెంబర్‌ 11న ఉదయం 11 గంటలకు సిద్ధమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి ఆరోజున అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు కవిత ఈ- మెయిల్ ద్వారా సమాచారం అందించారు.

కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. దీంతో అధికారులు మరో రోజు విచారణకు అంగీకరించారు.

చదవండి: (ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ)

మరిన్ని వార్తలు