పాత పేపర్లు ఉన్నాయా.. మీకే ఈ బంపర్‌ ఆఫర్‌!

30 Mar, 2021 10:11 IST|Sakshi
విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న పాత పేపర్‌

పాత పేపర్‌ కిలో రూ.35 

సాక్షి, ఆదిలాబాద్‌ : పాత పేపర్‌ ధర అమాంతగా పెరిగిపోయింది. కిలో ధర రూ. 35 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పాతపేపర్‌ కొరత ఉండడంతో గిరాకీ పెరిగింది. గతంలో కిలో రూ. 4 నుంచి 9 రూపాయల వరకు మాత్రమే ఉండేది. కాని కరోనా నేపథ్యంలో పేపర్‌ మార్కెట్లోకి రాకపోవడంతో డిమాండ్‌ పెరిగింది. ఇటీవల మండల కేంద్రానికి చెందిన వ్యాపారి 10 టన్నుల పేపర్‌ను గుజరాత్‌ నుంచి కొనుగోళ్లు చేసి నిజమాబాద్, నిర్మల్‌ ప్రాంతాల్లో విక్రయించారు.  

చదవండి: కొడుకుతో సమయం కేటాయించాలని.. న్యూస్‌ పేపర్‌

మరిన్ని వార్తలు