తెలంగాణ హైకోర్టులో ఎన్ని లక్షల పెండింగ్‌ కేసులు ఉన్నాయో తెలుసా?

10 Feb, 2023 19:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,53,358, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు తెలిపారు. అంతేగాక ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసులను విచారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఉన్నాయని వెల్లడించారు.

సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం ఈ నెల 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 69,511 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అదే సమయంలో దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి మొత్తం 59,87,477 కేసులు పెండింగ్‌ ఉన్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు