ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐటీ దాడులు.. చాటుగా పత్రాలు తరలింపు

10 Nov, 2022 10:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం:  ఖమ్మంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఐటీ అధికా రులు దాడులు చేశారు. బిలీఫ్‌ ఆస్పత్రి, రోహిత్‌ సంతాన సాఫల్య కేంద్రం, శ్రీరాం కిడ్నీ సెంటర్లలో సోదాలు చేశారు.

సదరు ఆస్పత్రుల యాజ మాన్యాల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారని.. పలు పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. అయితే తనిఖీల కోసం ఐటీ బృందం రాగానే ఓ ఆస్పత్రి బాధ్యులు వెనుక భాగం నుంచి రహస్యంగా పలు పత్రాలను బయటికి తరలించడం కనిపించింది. 

మరిన్ని వార్తలు