దూడకు పాలిచ్చిన శునకం

17 Oct, 2020 17:59 IST|Sakshi

నిర్మ‌ల్ :  కుక్కకు విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే అనేలా రుజువు చేసింది నిర్మల్ జిల్లాలో ఓ శునకం.. సోన్ మండలం సిద్దిలకుంట గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి అనే రైతు ఇంటి సమీపంలోని పశువులశాలలో ఉన్న దూడ వద్దకు శునకం వచ్చి పాలిచ్చింది. దూడకు శునకం పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది. ఈ దృశ్యం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయ్యింది. 
 

మరిన్ని వార్తలు