కుక్కల పరుగు పందెం.. మామూలుగా లేదుగా!

13 Feb, 2023 12:19 IST|Sakshi
పరుగు పందెంలో పాల్గొంటున్న శునకాలు

అయిజ(జోగుళాంబ గద్వాల జిల్లా): అయిజలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్రాష్ట్ర శునకాల పరుగు పోటీ నిర్వహించారు. పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 9 కుక్కలు పాల్గొనగా.. అన్ని బహుమతులను కర్ణాటక రాష్ట్రానికి చెందిన శునకాలు కైవసం చేసుకోవడం విశేషం.

ఇండి జిల్లాకు చెందిన వీఐపీ లల్యా ప్రథమ బహుమతిగా రూ.15,016, సుల్తాన్‌ ద్వితీయ బహుమతిగా రూ.10,016, తేజకళ్ల తృతీయ బహుమతిగా రూ.8,016, బాపురం జిల్లాకు చెందిన అంజి నాలుగో బహుమతిగా రూ.5,016 గెలుపొందాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు.
చదవండి: బాబా ముసుగులో ‘నిత్య’ పెళ్లికొడుకు  

మరిన్ని వార్తలు