సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. జిన్నారంలోని ఫార్మా కంపెనీలో డ్రగ్స్ డెన్లు బయటపడ్డాయి. 50 కిలోల నార్కోటిక్ డ్రగ్స్ని డి.ఆర్.ఐ అధికారులు పట్టుకున్నారు. డి.ఆర్.ఐ అధికారులకు దొరకకుండా డ్రగ్స్ను భూమీలో పాతి పెట్టారు. భూమిలో దాచిపెట్టినా డి.ఆర్.ఐ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి డ్రగ్స్ను బయటకు తీశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు రూ.6 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.