బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి పట్నం పోదాం.. అన్న విధంగా.. బారులు తీరిన వాహనాలు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జాతీయ రహదారిపై కనిపించాయి. దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగు పయనం కావడంతో వాహనాల రద్దీ ఏర్పడింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి