TS EAMCET Counselling Dates 2022: 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

13 Aug, 2022 04:09 IST|Sakshi

షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంజనీరింగ్‌ ప్రవేశాల కమిటీ

వచ్చే నెల 6న తొలి విడత సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది.


చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్‌లో బాలికలు

మరిన్ని వార్తలు