సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో భూ ప్రకంపనలు

8 Aug, 2021 11:22 IST|Sakshi

ఉదయం రెండుసార్లు కంపించిన భూమి

సాక్షి, సూర్యాపేట: చింతలపాలెం మండల కేంద్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం వాసుల్ని వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆదివారం ఉదయం రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 7:40, 8:20 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 1.8గా నమోదైనట్టు ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్‌ ధ్రువీకరించారు. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి కంపించడంతో జనం ఇళ్లల్లోనుంచి పరుగులు పెట్టారు.

మరిన్ని వార్తలు