చూస్తూ ‘ఊరు’కోం..

7 Jun, 2022 03:35 IST|Sakshi

విత్తనాలతో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టారా గ్రామస్తులు. తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించి దాడి చేయడంతో జైపాల్‌రెడ్డి అనే రైతు మనస్తాపం చెందాడు. కొడుకు చరణ్‌రెడ్డితో కలిసి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతు కష్టం చూసి ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. చందాలతో విత్తనాలు కొని ఆ రైతు భూమిని చదును చేసి పత్తి విత్తనాలు వేశారు. భూకబ్జాకు యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగింది. – తలమడుగు/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు