‘వార్‌ రూమ్‌’ కేసులో మల్లు రవి!

11 Jan, 2023 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవిని నిందితుడిగా చేర్చా­లని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్ణ­యించారు. గురువారం విచారణకు హాజరు­కావా­ల్సిందిగా ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ‘నా వాంగ్మూలం న­మో­దు చేయండి’ అంటూ మల్లు రవి ఇటీవల సై­బర్‌ క్రైమ్‌ పోలీసులకు లేఖ రాయడం,

సోమ­వా­రం దర్యాప్తు అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మల్లు రవి మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసు­స్టేషన్‌కు వచ్చారు. తనకు ఇచ్చిన నోటీసుపై అక్కడి అధికారులను వివరాలు కోరారు. దానికి సంబంధించిన వివరాలు అందించిన అధికారులు గురువారం విచారణకు హాజ­రవ్వాలని చెప్పారు. అది ముగిసిన తర్వాత ఈ కేసులో మల్లు రవిని ఐదో నిందితుడిగా చేరుస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు