సివిల్స్ ప్రిలిమ్స్పై నిపుణులు.. ఈసారి అంతర్జాతీయ వ్యూహాలకు ప్రాధాన్యం
కరోనా, ప్రైవేటు స్పేస్ ఏజెన్సీలకూ స్థానం.. నెల రోజుల్లో నీట్గా చదవాల్సిందేనని సూచన
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జూన్ 5న నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఈసారి భిన్నంగా ఉండే అవకాశం ఉం దని నిపుణులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనట్లు ఈసారి అంతర్జాతీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని, ప్రధాని మోదీ వ్యూహాత్మక అంతర్జాతీయ సంబంధాలు పరీక్షలో కీలకపాత్ర పోషించే వీలుందని భావిస్తున్నారు. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గమనం, వ్యాక్సినేషన్, పరిశోధనలపై ప్రశ్నలకు ఎక్కువ చాన్స్ ఉంటుందని అంచనా. టెక్నా లజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలూ ప్రశ్నావళిలో కనిపిస్తాయని చెబుతున్నారు. ప్రిలిమ్స్కు ప్రణాళికాబద్ధంగా చదవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
వీటిపై దృష్టి పెట్టాలి
నెల రోజులు ప్రణాళికతో సిద్ధమవ్వాలి
ప్రిలిమ్స్కు ప్రణాళికాబద్ధంగా, అంశాల వారీగా ప్రిపేర్ కావాలి. రెండుమూడు రోజులకో సబ్జెక్టు రివిజన్ చేసుకోవాలి. ప్రిలిమ్స్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మూలస్తంభాలు. సైన్స్ అండ్ టె క్నాలజీ, ఎన్విరాన్మెంట్, అంతర్జాతీయ, ప్రాం తీయ సంబంధాలు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఈమధ్య ఆర్ట్ అండ్ కల్చర్ కొత్తగా వచ్చింది. – బాలలత (సీబీఎస్, ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్)