అయ్యో.. రైతన్నా

26 Jul, 2021 02:18 IST|Sakshi
విద్యుత్‌ తీగలపై విగతజీవిగా ప్రభాకర్‌

కామేపల్లి: తోటి రైతుకు సాయం చేయడానికి వెళ్లిన ఓ రైతు విద్యుత్‌ స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు. వివరాలు.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడంలో ఓ రైతుకు చెందిన కరెంటు మోటారుకు ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అదే గ్రామానికి చెందిన సూర ప్రభాకర్‌(46)  విద్యుత్‌ స్తంభం ఎక్కి తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీగలపై వేలాడుతూనే ప్రాణాలు వదిలాడు.

మరిన్ని వార్తలు