నిజామాబాద్‌లో అమానవీయ ఘటన.. కూతురు బతికుండగానే పెద్దకర్మ

15 Sep, 2023 14:58 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బతికున్న కూతురికి కన్నతండ్రి పెద్దకర్మ చేశాడు. పెళ్లి చేసిన అల్లుడికి బోన్ క్యాన్సర్ ఉండటంతో వివాహిత నందిని తల్లిగారింటికి వచ్చి జీవిస్తోంది. ఈక్రమంలో ప్రేమించిన ఓ వ్యక్తితో ఆమె పారిపోయింది. దీంతో కూతురిపై ఆగ్రహంతో తండ్రి మహేష్ ఆమె చనిపోయిందంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కూతురు బతికి ఉండగానే ‘మరణం 10 - 09 - 2023’ అంటూ గురువారం పెద్ద కర్మ చేశాడు.

మరిన్ని వార్తలు