దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం

3 Jul, 2022 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్‌ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌-పగిడిపల్లి మధ్య బోగిలో మంటలు చేలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 

అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు